గుండెపోటుతో వ్యక్తి మృతి

ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 7 : మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఉప్పరి బంకులింటి బీచుపల్లి వయసు (76) గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ జోగుల రవి మృతి చెందిన బీచుపల్లి పార్థివ దేహానికి పూల మాలలు వేసి బీచుపల్లి ఆత్మ శాంతించాలని కోరుతూ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.