గుజ్రాల్కు తెదేపా నేతల నివాళి
న్యూఢిల్లీ : అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, హరికృష్ణ నివాళులు అర్పించారు. దేశానికి ప్రధానిగా సేవలందించిన గుజ్రాల్ మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశం ఓ మంచి నేతను కోల్పోయిందని తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.