గుజ్రాల్ అంత్యక్రియలకు హాజరుకానున్న రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ఐకే గుజ్రాల్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గాను ప్రస్తుతం కోల్కతా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. శనివారం ఢిల్లీలో జరిగే అంత్యక్రియలకు ప్రణబ్ హాజరవుతారని తెలియజేశారు.