గుజ్రాల్‌ మృతిపై ప్రముఖుల సంతాపం

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని గుజ్రాల్‌ మృతిపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తన సంతాప సందేశాన్ని గుజ్రాల్‌ కుమారుడు నరేష్‌కు పంపించారు. గుజ్రాల్‌ మృతిపట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. గుజ్రాల్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.