గున్గల్ ప్రాథమిక పాఠశాల లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీపీ జెడ్ పి టి సి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూలై20(జనంసాక్షి):-యాచారం మండల పరిధిలోని గున్గాల్ లో  ప్రాథమిక పాఠశాలలో ఎంపీపీ కొప్పు సుకన్య భాష, జెడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య, స్థానిక సర్పంచ్ ఇందిరా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రూ. ఐదు లక్షలతో చేపట్టనున్న పనులను ప్రారంభించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకై ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని అన్నారు.  కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి మండల తెరాస నాయకులు   ఎంపీడీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Attachments area