గురుకులాల్లో నిర్లక్ష్యం తాండవిస్తోంది

ఎక్స్‌ వేదికగా మండిపడ్డ హరీష్‌ రావు
హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనంసాక్షి): కేసీఆర్‌ హయాంలో వెలుగొందిన గురుకులాలు విూ నిర్లక్ష్యం వల్ల మసకబారుతున్నాయని ఎక్స్‌ వేదికగా హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు. విూ పాలన ఎలా ఉందొ చెప్పడానికి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గురుకులాలే నిదర్శనమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇకనైనా మొద్దునిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతుల కల్పణపై తక్షణమే చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం మానేసి ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.గురుకుల విద్యార్థులు ఎలుకలు కరిచి దవాఖానల పాలవుతుంటే ఏం చేస్తున్నా వంటూ ప్రశ్నించారు. గత 8 నెలల్లో 500 మందికిపైగా గురుకుల విద్యార్థులు ఆసుపత్రుల పాలైతే, 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్నారు. గురుకులాల అధ్వాన్న పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌ రెడ్డే బాధ్యుడని చెప్పారు. ’మొన్న మెదక్‌ జిల్లాలోని రామాయంపేట గురుకుల పాఠశాలలో 12మంది విద్యార్థుల విూద ఎలుకల దాడి. నిన్న నల్లగొండ జిల్లాలోని కొండభీమనపల్లి
గురుకుల విద్యార్థులు ఎలుకలు కరిచి ఆసుపత్రుల పాలవుతుంటే ఏం చేస్తున్నావ్‌.?, పాముకాటుకు గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే ఏం చేస్తున్నావ్‌.? కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలవుతుంటే ఏం చేస్తున్నావ్‌?. గత 8 నెలల కాలంలో 500 మంది పైగా గురుకుల విద్యార్థులు ఆసుపత్రుల పాలైతే, 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. గురుకులాల అధ్వాన్న పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న నువ్వే బాధ్యుడివి. విూ పాలన ఎట్లుందో చెప్పడానికి సమస్యల
వలయంలో కొట్టుమిట్టాడుతున్న గురుకులాలే నిదర్శనం. కేసీఆర్‌ ప్రభుత్వంలో వెలుగొందిన గురుకులాలు విూ నిర్లక్ష్యం కారణంగా మసకబారుతున్నాయి. ప్రతిపక్షాల విూద నోరు పారేసుకోవడం మానేసి ఇప్పటికైనా పాలన విూద దృష్టి పెట్టు. మొద్దునిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతులు కల్పించేందుకు తక్షణం చర్యలు చేపట్టు.’ అంటూ ట్వీట్‌ చేశారు.