గుర్రం జాషువా పేరిట ఏటా అవార్డులు

క్యాలెండర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో మంత్రి నక్కా

గుంటూరు,జనవరి22(జ‌నంసాక్షి): గుర్రం జాషువా పేరిట ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తున్నామని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.గుర్రం జాషువాకి ప్రభుత్వం తగినంత గుర్తింపు, గౌరవం ఇస్తుందన్నారు. రూ. 3 కోట్లతో గుర్రం జాషువా కల్చరల్‌ సెంటర్‌ నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. సమకాలీన కవులు, కళాకారులలో గొప్ప వ్యక్తి గుర్రం జాషువా అని పేర్కొన్నారు. జాషువా కల్చరల్‌ సెంట్రల్‌ ఆధ్వర్యంలో గుంటూరు క్యాంపు కార్యాలయంలో అమరావతి తెలుగు- వెలుగు 2019 క్యాలెండర్‌ ఆవిష్కరణ మంగళవారం నిర్వహించారు. మంత్రి నక్కా ఆనందబాబు చేతుల విూదుగా ఈ క్యాలెండర్‌ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ… రచనలు, వ్యాసాలు ద్వారా జాషువా ఖ్యాతి మరింత పెరుగుతుందన్నారు. టిడిపి ప్రభుత్వం కళాకారులకు అత్యంత ప్రాధాన్యత నిస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, జానపద కళల అకాడమి చైర్మన్‌ పొట్లూరి హరికృష్ణ, రచయితలు పాల్గొన్నారు.