గో ఎయిర్ మరోమారు బంపర్ ఆఫర్
ముంబయి,ఆగస్ట్6(జనం సాక్షి): గో-ఎయిర్ విమానయాన సంస్థ మరోసారి బంపర్ ఆఫర్లకు తెరలేపింది. దీంతో తక్కువ ధరలకే విమానయాన సౌకర్యం తీసుకుని వచ్చింది. 10 లక్షల సీట్లను అతిచౌక ధరలకు అందుబాటులోకి తెచ్చింది. టిక్కెట్ ప్రారంభ ధర రూ.1099లుగా ఖరారు చేసిన గో-ఎయిర్.. పేటీఎం ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.250 రాయితీ లభిస్తుందని ప్రకటించింది. ‘ఫెస్టివల్ సీజన్’ పేరుతో శనివారం నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ ఆగస్టు9వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ టిక్కెట్లపై ఆగస్టు 4 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రయాణించవచ్చని గో-ఎయిర్ తెలిపింది. తమ వెబ్సైట్, మొబైల్ ద్వారా బుక్ చేసుకునే ప్రయాణికులకు రూ.3000 వరకు ప్రత్యేక డీల్స్ ఉన్నట్లు ప్రకటించింది. వాడియా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ దేశవ్యాప్తంగా 23 ప్రాంతాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. గత నెల మొదటివారంలో ఇలానే భారీ ఆఫర్లను ప్రకటించిన ఇండిగో రూ.1212లకు ఏకంగా 12లక్షల సీట్లను అందుబాటులో ఉంచింది.