గౌస్ నగర్ లో మారమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి 51,000 విరాళం అందజేసిన తంగళ్ళపల్లి రవికుమార్

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామంలో మారమ్మ తల్లి దేవాలయ నిర్మాణం పనుల కోసం సోమవారం టిపిసిసి డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్ రూ.51,000 వేలు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈర్ల కృష్ణ ముదిరాజ్, పాశం రామ్ రెడ్డి, నల్ల మాస వెంకటేష్, నల్లమోస నాదం గౌడ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.