గ్రామదర్శినిలో పాల్గొన్న మంత్రి

చిత్తూరు,నవంబర్‌24(జ‌నంసాక్షి): పలమనేరు మండలంలోని కూర్మాయి పంచాయతీ జల్లిపేటలో శనివారం గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ రెడ్డి గ్రామంలో పర్యటించారు. అనంతరం గ్రామ దర్శిని గ్రామ వికాసంలో పాల్గొని గ్రామస్తులతో మాట్లాడనున్నారు. ఇదిలావుంటే పెద్ద పంజాణి మండలం పెద్ద పంజాణి పంచాయతీలో టిడిపి సభ్యత్వ నమోదుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఎంపిటిసి ముబారక్‌ తాజ్‌ పేర్కొన్నారు. పెద్ద పంజాణి మండలంలోని పెద్ద పంజాణి పంచాయతీ గ్రామాల్లో శనివారం బెరపల్లిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపిటిసి ప్రకటించారు. ఈ సందర్భంగా పలమనేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు నాగరాజ మాట్లాడుతూ.. టిడిపి సభ్యత్వం తీసుకుంటే, కార్యకర్తలందరికీ భరోసా లభిస్తుందని, అదే విధంగా రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని తెలిపారు. సభ్యత్వ నమోదుపై స్థానిక కార్యకర్తలకు జెబి కమిటీ సభ్యులు డి.క్రిష్ణా రెడ్డి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చెంగారెడ్డి, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.