ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి

ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి

మల్లాపూర్,సెప్టెంబర్27, (మల్లాపూర్)
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు, స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా పరితపించిన తొలితరం ఉద్యమ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా మల్లాపూర్ మండల కేంద్రంలో పద్మశాలి  మండల అధ్యక్షులు అయ్యెరి దశరథం  ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి
నిర్వహించారు.స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి పలువురు నేతలు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశాలి జిల్లా అధ్యక్షుడు రుద్రశ్రీనివాస్ మాట్లాడుతూ బాపూజీ తెలంగాణ తొలిదశ ,మలిదశ  ఉద్యమంలో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని వారి పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లి కేసీఆర్‌ను ప్రోత్సహించడమే కాకుండ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న తన నివాస గృహం జలదృశ్యంను టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఇచ్చారని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై నవీన్ కుమార్ జడ్పిటిసి సందిరేడ్డి శ్రీనివాస్ రెడ్డి ,ఎంపీపీ కాటేపేల్లి సరోజన అదిరెడ్డి ,ఎంపిటిసి ఆకుతోట రాజేష్ ,మర్రిపెల్లి సత్తమ్మ మల్లయ్య, పద్మశాలి మండల అధ్యక్షుడు దశరథం పద్మశాలి మండల ప్రధాన కార్యదర్శి పెంబి మహేందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు సంబారి శంకర్ ,పట్టణ అధ్యక్షులు రుద్ర లక్ష్మి రాజం , సిరిపురం రవీందర్ ,మండల కార్యవర్గ సభ్యులు మోర సతీష్, కట్టెకొల వివేకానంద, చిప్ప రవీందర్, భూస భూమేశ్వర్,విజయ్ నేత, సర్పంచులు భూక్య గోవింద నాయక్, మైదాసు శ్రీనివాస్,బద్దం సరిత కమలాకర్ , నాయకులు ముద్దం శరత్, లింగస్వామి , క్యాతం జీవన్ , క్యాతం సురేష్ , పెద్దిరెడ్డి లక్ష్మణ్,ముద్దం సత్యనారాయణ వివిధ గ్రామాల నుంచి పద్మశాలి సభ్యుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు.