ఘనంగా దండారి ఉత్సవాలు నిర్వహించిన గ్రామస్తులు.

అధికారులు ప్రజాప్రతినిధులు.
జనం సాక్షి నార్నూర్.
దీపావళి పండుగ సందర్భంగా ఏత్మాసూర్ దేవునికి పూజలు దండారి ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వరుణ్ రెడ్డి ఉట్నూర్ ఎఎస్పి హర్షవర్ధన్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పాల్గొని ఆదివాసి సాంప్రదాయాలకు తెలంగాణ ప్రభుత్వం 10వేల రూపాయలు మద్దతుగా ప్రకటించిన  చెక్కు పంపిణి చేశారు.అనంతరం ఆదివాసి సాంప్రదాయాల గురించి తెలుసుకొని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివాసి మహిళలతో కలిసి నృత్యం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి ఐటిడిఎ చైర్మన్ కనక లక్కేరావు తెరాస నాయకుడు యూనుస్ అక్బాని ఆత్రం సక్కు యూత్ ఫోర్స్ ఆత్రం వినోద్ వినోద్ కుమార్ నార్నూర్ ఎంపీపీ కనక మోతు బాయి సార్ మేడి దుర్గా పటేల్ స్థానిక సర్పంచ్ పరమేశ్వర్ మండల మహిళా అధ్యక్షురాలు జాదవ్ విద్య రాణి తదితరులు ఉన్నారు.