ఘనంగా బాలల దినోత్సవం

బషీరాబాద్ నవంబర్ 14, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో బ్రిలియంట్ కాన్వెంట్ పాఠశాలలో బాలల దినోత్సవన్ని సెల్ఫ్ గవర్నమెంట్ డే గా ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాజా శేఖర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు ఆన్ని చెప్పారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బాలల్ల దినోత్సవం ఘనంగా జరుపుకొని,విద్యార్థి, విద్యార్థులు ఒక రోజు ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు.ఈ పాఠాలు బోధించిన విద్యార్థి విద్యార్థులకు విజేతలుగా ప్రకటించి వారికి బహుమతులు అందించామని,అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థి, విద్యార్థులకు  ప్రతి తరగతి నుండి ఎన్నుకొని వారికి కూడా బహుమతులు అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు రాజ్ కుమార్ కులకర్ణి, తదితరులు పాల్గొన్నారు