*ఘనంగా మహాత్మా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు*

పెబ్బేరు అక్టోబర్ 02 (జనంసాక్షి):
పెబ్బేరు మండల కేంద్రంలో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి వేడుకలను  మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచానికి అహింసా సత్యం ధర్మ మార్గాలను చూపిన మహానీయులు దేశ స్వతంత్ర సమరయోధులు, జాతిపీత  మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మరియు స్వతంత్ర దేశంలో రెండోవ ప్రధానిగా దేశ ప్రజలకు సేవలు అందించి,జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ముందుకెళ్లిన మహనీయులు, ఆదర్శమైన జీవితం గడిపిన శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి   చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దుల విజయవర్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేశ్ సాగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ సత్యనారాయణ,యుగంధర్ రెడ్డి, మాజీ డైరెక్టర్ రాములు, ఎండి షెకీల్,ధూపం సర్వేష్, గంధం సునీల్ యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ రణధీర్ రెడ్డి భాను హేమంత్ రెడ్డి వినయ్ వనపర్తి జిల్లా సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.