ఘనంగా మాజీ ఎమ్మెల్యే అరిబండి లక్ష్మి నారాయణ 24 వ వర్థంతి.

 

నేరేడుచర్ల(జనంసాక్షి )న్యూస్. తెలంగాణ సాయుధ రైతంగ పోరాటయోధుడు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ అరిబండి.లక్ష్మీనారాయణ 24వ వర్ధంతి ని బుధవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం అరిబండి భవన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహర్లు అర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు, కొదమగుండ్ల నగేష్ లు మాట్లాడుతూ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా సాగిన పోరాటం, సాయుధ పోరాటంగా మారి భూమి, భుక్తి ,విముక్తి పోరాటంగా మారిన సందర్భంలో కామ్రేడ్ అరిబండి. లక్ష్మీనారాయణ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, కమ్యూనిస్టు పార్టీలో,సాయుధ పోరాటంలో ముందుండి నడిచారని,హుజూర్ నగర్, మిర్యాలగూడ,మునగాల పరగణ లో కమ్యూనిస్టు పార్టీ ఎదుగుదలకు రైతాంగ పోరాటం చేసిన గొప్ప నాయకుడని మిర్యాలగూడ ఎమ్మెల్యేగా నిస్వార్ధంగా పనిచేసిన నిజాయితీపరుడు,కమ్యూనిస్టు యోధుడు, అరి బండి అంటేనే దోపిడోళ్ల గుండెలు అదిరేవని, భూస్వాములకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజల్ని సమీకరించి ప్రజా ఉద్యమాలు నడిపిన ప్రజా నాయకుడిని అన్నారు.ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేసి కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి పని చేసిన నాడే అరిబండి కి ఘనమైన నివాళులు అర్పించిన వారిమవుతామని అన్నారు.ఈ వర్ధంతి సభలో సిపిఎం మండల కార్యదర్శి సిరికొండ శ్రీను,సిపిఎం నాయకులు కుంకు తిరుపతయ్య ,నీలా రామ్మూర్తి, టిడిపి పట్టణ అధ్యక్షులు పాల్వాయి రమేష్, మచ్చ సోమయ్య సిహెచ్ కృష్ణవేణి,సట్టు. శ్రీను,కుంకు.మోహన్ రావు,గుర్రం యేసు,సీతారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.