ఘనంగా మూలా నక్షత్ర దీపోత్సవం

 మల్దకల్ అక్టోబర్ 2 (జనంసాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం మూలా నక్షత్ర దీపోత్సవం ఘనంగా నిర్వహించారు.దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం దేవాలయంలో పంచామృతాభిషేకాలు దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం లక్ష్మీదేవిని శారదాదేవి అలంకరణలో పూజ కార్యక్రమం జరిగింది.గద్వాల కు చెందిన కేశవకుమార్ (వైభవ్ఆదిత్య ఐ క్లినిక్)అనే భక్తుడు 230 గ్రాములవెండిని స్వామివారికి బహుకరించగా ఆలయ చైర్మన్ స్వీకరించి పూజలు నిర్వహించారు. శ్రీనివాస సిద్ధాంతి శ్రీనివాస కళ్యాణం గురించి భక్తులకు పురాణ ప్రవచనాలు వినిపించారు.ఈ సందర్భంగా దేవాలయంలో గట్టు గోవిందరావు బ్రదర్స్ పులిహోర కోట ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్కూరు రాఘవేంద్రరావు,బిజెపి రాఘవేంద్రరావు, అరవిందరావు,చంద్రశేఖర రావు,చంద్ర శేకర్ రెడ్డి బాబురావు,గోవిందరావు భక్తులు పాల్గొన్నారు.