చంద్రగిరిలో విద్యా పక్షోత్సవాలు

హైదరాబాద్‌:విద్యా పక్షోత్సవాలను ఈ నెల 9న చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.తొలుత ఈ కార్యక్రమాన్ని నగరంలో ప్రారంభించాలని అనుకున్నప్పటకీ సీఎం చిత్తూరు జిల్లా పర్యటనను పురస్కరించుకొని దీన్ని చంద్రగిరిలో ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌ తెలిపారు.