చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత: ఎమ్మెల్సీ

అనంతపురం,నవంబర్‌22(జ‌నంసాక్షి): చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే ప్రజలు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు భారీగా స్పందన వస్తోందని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాల్లో మార్పు తెస్తున్నారన్నారు. ప్రజలకు కూడా ఇప్పుడు జగన్‌ రావాలన్న ఆకాంక్ష పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జిల్లా నలుమూలలా వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రజలకు చెప్పేదొకటి, చేసేదొకటి అని ధ్వజమెత్తారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హావిూని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసగించారని మండిపడ్డారు.