చంద్రబాబు కటకటాలు పొడిగింపు..!

చంద్రబాబు కటకటాలు పొడిగింపు..!
విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ మళ్లీ పొడిగించారు. రెండ్రోజుల సీఐడీ కస్టడీ, రిమాండ్‌ ముగియడంతో ఆన్‌లైన్‌ ద్వారా విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. సీఐడీ అధికారుల విజ్ఞప్తి మేరకు అక్టోబర్‌ 5వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారా? వైద్య పరీక్షలు చేశారా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తనను ఎవరూ ఇబ్బంది పెట్టలేదని బాబు సమాధానమిచ్చారు. విచారణ అనంతరం రిమాండ్‌ పొడిగిస్తూ జడ్జి ఆదేశించారు.