చంప ఛఢేల్‌..

2

– అధికారిపై చేయి చేసుకున్న సిద్ధిరామయ్య

కర్నాటక,జనవరి16(జనంసాక్షి):ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బళ్లారి నగరపాలక సంస్థ కమిషనర్‌ రమేశ్‌ పై.. బహిరంగంగానే చేయి చేసుకున్నారు. బళ్లారి కౌల్‌ బజార్లోని వాల్మీకి భవన్‌ ప్రారంభోత్సవానికి హాజరైన సిద్ధరామయ్య.. తనకు అడ్డు వచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్‌ రమేశ్‌ చెంప చెళ్లుమనిపించారు. ఈ దృశ్యాలు కన్నడ టీవీలన్నింటా ప్రసారమయ్యాయి. అయితే.. సీఎం తనను కొట్టలేదని.. పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు వచ్చిన తనను.. తోయవద్దంటూ భద్రతాసిబ్బందిని ఆదేశించారంటూ.. కమిషనర్‌ రమేశ్‌… ప్రెస్‌ విూట్‌ పెట్టి మరీ వివరణ ఇవ్వడం కొసమెరుపు.