చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపినా -జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ మరియు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి

చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపినా -జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ మరియు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి

జనగామ ప్రతినిధి (జనంసాక్షి)సెప్టెంబర్ 28: జనగామ జిల్లా కేంద్రం గుండ్లగడ్డ ప్రాంతానికి చెందిన 29 వార్డ్ అధ్యక్షుడు మామిడిపల్లి శంకర్ ప్రసాద్ తండ్రి మామిడిపల్లి ఎల్లస్వామి మరియు మక్దుం బి చనిపోగా జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ మరియు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి , జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ పోకల జమునతో కలిసి కుటుంబాలను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తము ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్భంగా పాగాల సంపత్ రెడ్డి మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ భారత రాష్ట్ర సమితి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని, మున్ముందు అన్ని రకాల సహకారం ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు తాళ్ల సురేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సెవెళ్లి మధు, మైనారిటీ ప్రెసిడెంట్ ఎమ్. డి.సలీమ్, భారస నాయకులు ఉల్లెంగుల నర్సింగ్, పానుగంటి ప్రవీణ్,త్రియంబకేశ్, ఎండి సాజిద్, పులి సాయి, తోట సుభాష్, చెన్నోజు పూర్ణ శేఖర్, ఎండి షకీల్, సీసా రాజు తదితరులు పాల్గొన్నారు.