చలో ఢిల్లీ: చలసాని

చలో ఢిల్లీ: చలసాని

ఏలూరు,నవంబర్‌20(జ‌నంసాక్షి): ప్రత్యేక ¬దా సాధన కోరుతూ.. చలో ఢిల్లీకి ప్రత్యేక ¬దా సాధన కమిటీ అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం పాలకొల్లులో నిర్వహించిన సమావేశంలో చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. డిసెంబర్‌లో నిర్వహించనున్న పార్లమెంట్‌ సమావేశాల సమయంలో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులతో ప్రత్యేక ¬దా సాధన కోరుతూ ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చామని చెప్పారు. ఈ నెల15 న పలాస నుంచి జీపు జాత ప్రారంభించామని, ఈ నెల 29 న

అనంతపురంలో ముగింపు సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక ¬దా కోరుతూ ప్రధానమంత్రి ఇంటిని ముట్టడి చేసే దమ్ము ఆంధ్ర విద్యార్థులకే ఉందని చలసాని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. దీంతో మారు మన సత్తా చాటాలన్నారు.