చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఘనంగా నివాళులు…..

భువనగిరి టౌన్ (జనం సాక్షి):-

భువనగిరి పట్టణంలోని శివ మట్టం నందు వీరాభిమన్యు యూత్ ఆధ్వర్యంలో మరియు స్థానిక అమరవీరుల స్థూపం వద్ద మరియు స్థానిక దోభిఘాట్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ గారి 128 వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రత్నపురం బలరామ్, వై ఎల్ ఎం ఎస్ బ్యాంక్ డైరెక్టర్ చల్ల గురుగుల రఘుబాబు నీలం రమేష్ పాల్గొని ఐలమ్మ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడువాలని జాతి అభివృద్ధికి పాలుపాడలన్నారు, తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భూక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ ధీర వనిత మహిళ లోకానికి స్ఫూర్తినిచ్చిన చిట్యాల ఐలమ్మ గారికి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రత్నపురం పద్మ మరియు దక్షి నేశ్వర స్వామి ఆలయం కమిటీ చైర్మన్ రత్న పురం శ్రీశైలం, రజక వృత్తిదారుల సంఘం నాయకులు గుణాల శివ , కుంచం బాలు ,దోసపాటి మురళి, మైలరం శ్రీను, రత్నపురం శ్రీరామ్, మైలారం లింగం,, బండారి వెంకటేష్, కుంచం రాజు , దోసపాటి హరీష్, చల్ల గురుగుల శివ, తునికి ఆకాష్ తేజ, శేఖర్, వెంకటేష్ ,రాము , కిరణ్, భాలు , భరత్, సాయి, ముదిగొండ మహేష్,తదితరులు పాల్గొన్నారు.