చింతమనేని ఆగడాలు కనిపించడం లేదా?

బాబుకు సిపిఐ నేత రామకృష్ణ లేఖ

అమరావతి,నవంబర్‌26(జ‌నంసాక్షి): ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన సమయం ఇదంటూ దేశమంతా తిరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్రంలో తన పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆగడాలు కనిపించడం లేదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. చింతమనేని ఆగడాలపై సమాధానం చెప్పాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ రామకృష్ణ సోమవారం లేఖ రాశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలు చట్టం పనిచేస్తోందా, లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చింతమనేనిని తక్షణం అరెస్టు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదై రెండు నెలలవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. విజిలెన్స్‌, విూడియా, రెవెన్యూ, ఫారెస్టు

అధికారులపై దాడులకు పాల్పడినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంలోని ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సిఎం, తన ఎమ్మెల్యే ఆగడాలు, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.