చిత్తూరు జిల్లాలో మహిళ దారుణ హత్య

చిత్తూరు,జనవరి3(జ‌నంసాక్షి): చిత్తూరు జిల్లాలోని పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ వరంపాటివారి పల్లెకు చెందిన జి.వరలక్ష్మి (36) దారుణ హత్యకు గురైంది. ఆవులు మేపేందుకు బుధవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన వరలక్ష్మి రాత్రి అయినా ఇంటికి చేరలేదు. దీంతో ఆమె కోసం ఆమె భర్త శేషాద్రి బుధవారం  రాత్రి తమ బంధువులు,  గ్రామస్తులను విచారించి బంధువుల ఇంటికి వెళ్లి ఉండవచ్చనే ఉద్దేశంతో గురువారం ఉదయం వరకు ఎదురు చుశాడు. అయితే గ్రామ సవిూపంలోని వ్యవసాయ పొలాల్లో పడి ఉన్న వరలక్ష్మి మృతదేహాన్ని గురువారం ఉదయం స్థానికులు కనుగొన్నారు.  భార్య శవమై కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పీలేరు ఎస్సై సుధాకర్‌ రెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భూవివాదంతో మహిళపై కత్తిదాడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడం పంచాయితీ అబ్బాపట్ల పల్లి గ్రామంలో గురువారం భూ తగాదాలు చోటుచేసుకున్నాయి. భూ వివాదంతో మొదలైన గొడవ ఇరువురి  మధ్య  పెద్ద ఘర్షణకు దారి తీసింది. కస్తూరి అమ్మ అనే మహిళపై అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు  కత్తితో దాడికి పాల్పడ్డాడు.  మహిళ పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.