చుక్క భూముల సమస్యలకు చెక్‌

అధికారులతో సవిూక్షలో సిఎస్‌ అనిల్‌ చంద్ర పునేఠ
అమరావతి,జనవరి3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఉన్న చుక్క భూములకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సవిూక్షించారు. గురువారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి, సిసిఎల్‌ మన్‌ మోహన్‌ సింగ్‌,ముఖ్యమంత్రి వర్యుల ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌లతో ఈఅంశంపై సవిూక్షించారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చుక్క భూములు అందుకు సంబంధించి పరిష్కరించాల్సిన అంశాలపై అధికారులతో ఆయన సవిూక్షించారు. జిల్లాల వారీ చుక్కభూములు వివరాలను తెల్సుకుని వాటికి సంబంధించిన సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తుందీ ఆరా తీసారు. ఇంకా చుక్క భూములకు సంబంధించిన వివిధ అంశాలను సిఎస్‌ రెవెన్యూ ఉన్నతాధికారులతో ఈసమావేశంలో చర్చించారు. ఈసమావేశంలో రెవెన్యూ శాఖ అధికారులు రామ్‌ ప్రసాద్‌,రామచంద్ర మూర్తి తదితరులు పాల్గొన్నారు.