చెరువు ఆక్రమణలపై మాజీమంత్రి బైఠాయింపు

ఏలూరు,నవంబర్‌27(జ‌నంసాక్షి): జగన్నాథపురంలో ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించడంతో మంగళవారం
ఉద్రిక్తత నెలకొంది. తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం జగన్నాధపురం గ్రామంలో చెరువు అక్రమ తవ్వకాలను నిరసిస్తూ.. మాజీ మంత్రి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. దీంతో ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం కొవ్వూరు డిఎస్పి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేతో చర్చలు కొనసాగిస్తున్నారు.