చైతన్యం ప్రదర్శించిన మంథని నియోజకవర్గ ఓటర్లు – 82.74 శాతం పోలింగ్ నమోదు

మంథని, (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఓటర్లు తమ చైతన్యం ప్రదర్శించారు. పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మంథనిలో అత్యధికంగా పోలింగ్ నమోదయింది. మంథని నియోజకవర్గంలో 2,36,442 మంది ఓటర్లు ఉండగా 1,95,635 మంది ఓటర్లు (82.74 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మహిళలు 9,85,65 మంది, పురుషులు 9,70,61 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలే ఓటు వేయడంలో ఆసక్తి చూపారు. పెద్దపల్లిలో 81.46 శాతం, రామగుండంలో 68.74 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తుది వివరాలు వెల్లడించారు.మంథని నియోజకవర్గంలో రామగిరిలో అత్యల్పంగా 75.18 శాతం, అటవీ ప్రాంతమైన పలిమెల మండలంలో అత్యధికంగా 90.82 శాతం పోలింగ్ జరగడం విశేషం.