చోరికి వచ్చి చిన్నారులను హతమార్చిన దొంగలు

సికింద్రాబాద్‌: దొంగతనానికి వచ్చిన దొంగలు ఇద్దరు పసి బిడ్డలను హత్యచేసిన సంఘటన సికింద్రాబాద్‌లోని అడ్డగుంట ప్రాంతంలో జరిగింది. వస్త్రవ్యాపారి యాకూబ్‌ ఇంటికి వచ్చిన దొంగలు తమ్రీన్‌(4), మహబూబ్‌(2) అనే చిన్నారులను ఉరివేసి హతమార్చారు. అనంతరం 9తులాల బంగారం నగదు అపహరించుకువెళ్లారు.