ఛత్తీస్‌గఢ్‌లో వాహనం లోయలో పడి 17 మంది మృతి

రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్‌ వాహనం అదుపు తప్పడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

అది 20 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.