ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు..
– 8మంది మావోయిస్టులు మృతి
– బీజూపూర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్న పోలీసులు
బీజాపూర్, జులై19(జనం సాక్షి) : చత్తీస్గడ్ అడవుల్లో మరోసారి అలజడి రేగింది. బీజాపూర్ ప్రాంతం తుపాకీల మోతతో దద్దరిల్లింది. గురువారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. స్పాట్లో 15 తుపాకీలతో మరికొన్ని ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ జరుపుతున్న సమయంలో మావోయిస్టులు ఎదురయ్యారు. దీంతో ఇరువురి మధ్య ¬రా ¬రీగా ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగిన సమయంలో ఒకరిద్దరు మావోయిస్టులు గాయాలతో పారిపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం కూడా భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. బీజాపూర్తో పాటూ చుట్టు పక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అదనపు బలగాలను కూడా రంగంలోకి దించారు. పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉదయాన్నే ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.