ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ : కోబ్రా మృతి

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓజవాను మృతి చెందాడు. సుక్మా జిల్లా పెమిడి దగ్గర పోలీసులుకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కోబ్రా కమెండో మృతి చెందాడు. మరో ఇద్దరు కోబ్రాలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని హెలికాప్టర్‌లో రాయపూర్‌ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం తెలిసింది.