ఛార్జీల పెంపుపై నేడు వరంగల్లో ప్రజాభిప్రాయ సేకరణ
వరంగల్: విద్యుత్ ఛార్జిల పెంపు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు తదితర అంశాలపై ఏపీ విద్యుత్ నియంత్రణ కమిషన్ వరంగల్ జిల్లాలో నేడు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఎంపీడీసీఎల్ పరిధిలో వరంగల్లోని జడ్పీ కార్యాలయంలో కమిషన్ బహిరంగం విచారణ జరపనుంది. మరోవైపు బహిరంగ విచారణ ముట్టడికి సీపీఐతోపాటు పలు ప్రజాసంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు చేపట్టారు.