జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ

అమరావతి, జనవరి18(జ‌నంసాక్షి) : ప్రతిపక్ష నేత, వైసిసి అధినేత జగన్‌కు ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. రైతాంగానికి ప్రతిపక్ష నాయకుడిగా విూరు చేసిందేమిటో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. ఆంధప్రదేశ్‌లో తాగేందుకు నీరు కూడా లేకుండా చేయాలని కేసీఆర్‌ పన్నిన కుట్రలో విూరు పావులుగా మారుతున్నారని లేఖలో విమర్శించారు. కేసీఆర్‌ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు వైసిపి నేతలు ప్రధాన కాంట్రాక్టర్లుగా ఉన్న విషయం జగమెరిగిన సత్యమేనని కళా వెంకట్రావు ఆరోపించారు. నవ్యాంధప్రదేశ్‌ను ఎడారిగా మార్చేందుకు కుట్రలు చేస్తున్న కేసీఆర్‌కు అండగా నిలిచారని మండిపడ్డారు. మోసం, దగాలతో రాష్టాన్రికి చారిత్రక ద్రోహం చేస్తున్నారని బహిరంగ లేఖలో పేర్కొన్నారు.