జగన్ ఆరోపణలపై లోకేశ్ ఎద్దేవా
ఇంకెన్ని డ్రామాలంటూ దెప్పిపొడుపు
అమరావతి,నవంబర్22(జనంసాక్షి): తన పాదయాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 108 వాహనాన్ని, ఆవుని పంపిచారంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ విూడియా వేదికగా ఏపి మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్పై వ్యంగ్యోక్తులు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. జగన్ తొలుత 108 డ్రామా ఆడారు… తర్వాత కోడికత్తి డ్రామా కొనసాగించారు… ఇప్పుడు ఆవు డ్రామా ఆడుతున్నారు… కానీ, జగన్ ఆడిన ఏ డ్రామా కూడా రక్తి కట్టలేదన్న ఆయన… చెత్త నటనకు అవార్డులంటూ ఉంటే జగనే అన్నీ కైవసం చేసుకుని ఉండేవారు… ప్రస్తుత చెత్త నటనకు భాస్కర్ అవార్డుతో సరిపెడదాం అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.