జనవరిలో కార్మిక సంఘాల సమ్మె

విజయనగరం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ.. సిఐటియు జిల్లా అధ్యక్షులు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు వి.కృష్ణంరాజు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మోదిలి శ్రీనివాసరావులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు పోస్టర్లను విడుదల చేసి  మాట్లాడారు. కార్మికుల కనీస వేతనాలు రూ.18 వేలు అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని, అసంఘటితంగా స్కీము వర్కర్లకు సమగ్ర చట్టం తేవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ.. జనవరిలో చేపట్టనున్న సమ్మెలో కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.