జన్మదిన వేడుకలు నుంచి మృత్యు ఒడికి

డ్యామ్‌లో పడ్డ కారు: ఆరుగురు దుర్మణం

మధ్యప్రదేశ్‌లో ఘోర దుర్ఘటన

భోపాల్‌,జూలై24(జ‌నంసాక్షి): స్నేహితుడి జన్మదిన వేడుకలు జరుపుకొని తిరుగు ప్రయాణమైన వారు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. కొద్దిక్షణాల క్రితమే ఉల్లాసంగా సాగిన ప్రయాణం వారికి అదే చివరి ప్రయాణమైంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషౄదం నింపింది. స్నేహితుని జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆరుగురు మిత్రుల బృందం కోలార్‌ డ్యాం కు చేరుకుంది. ఆనందోత్పాహాల మధ్య వేడుకలు జరుపుకొని తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే వారికి అనుకోని ప్రమాదం ఎదురైంది. ఓ మూలమలుపు వద్ద అదుపుతప్పి కారు డ్యామ్‌ లో పడిపోయింది. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్‌ లోని సె¬ర్‌ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. స్థానికుల సహాయంతో కారును బయటకు తీశామని, ఆరు మృతదేహాలను గుర్తించామని పోలీసులు తెలిపారు. శవపరీక్ష కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.