జమ్మూకాశ్మీర్‌లో ఆందోళనలకు పిలుపు

న్యూఢిల్లీ: అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలుపై జమ్మూకాశ్మీర్‌లోని వేర్పాటు వాదులు మండిపడ్డారు. ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చాలని కోరినా పట్టించుకోలేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేతలు ఆక్షేపించారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా జమ్మూకాశ్మీర్‌లో 4 రోజులపాటు ఆందోళనలు, బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు.