జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న మహేష్ గౌడ్

మునుగోడు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేపట్టిన గొల్ల కురుమల పోరుబాట ధర్నాలో పోలీసులు జర్నలిస్టులపై చేయి చేసుకోవడం సిగ్గుచేటన్నారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో బీజేవైఎం జిల్లా కోశాధికారి పానగంటి మహేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని,మునుగోడు ఉప ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం గొల్ల కురుమల ఖాతాలలో జమ చేసిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్య బద్దంగా ధర్నా చేస్తున్న ప్రతిపక్ష నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదని మండిపడ్డారు. సోమవారం మునుగోడు మండలం లో గొల్ల కురుమల పోరుబాట ధర్నా లో జర్నలిస్టు పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామనిన్నారు.  పోలీసు యంత్రాంగం బాధ్యత వహించి తక్షణమే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జంపాల ఆంజనేయులు , కడారి నరేష్, తెరటి నరేష్, ఉగ్గపల్లి స్వామి, తదితరులు పాల్గొన్నారు.