జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

వరంగల్‌,మే1(జ‌నం సాక్షి): జర్నలిస్టుల మస్యలు పరిష్కరించడంలో కలెక్టర్‌ చొరవ చూపాలని వరంగల్‌ జర్నలిస్టుల సంఘం కోరింది. ఈ మేరకు  ఇటీవల ఎన్నికైన టీయూడబ్ల్యుజే వరంగల్‌ అర్బన్‌ జిల్లా నూతన కమిటీ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి, పోలీస్‌ కమిషనర్‌ వి. రవీందర్‌లను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యులను వారు అభినందించారు. అలాగే జర్నలిస్టుల సమస్యలు, ప్రధానంగా ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి చర్చించారు. శాంతి భద్రతల విషయంలో సహకరించాలని సీపీ, కలెక్టర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యుజే ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి బీఆర్‌ లెనిన్‌, అర్బన్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు కృష్ణ గోవింద్‌, ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్‌, సంఘ బాధ్యులు సోమ నర్సయ్య, అంతడుపుల శ్రీనివాస్‌, బి. జయరాజ్‌, టి. శ్రీనివాస్‌, అర్షం రాజ్‌కుమార్‌, బి.రాజెందర్‌, కె. రవీందర్‌, పి.కరుణాకర్‌, సునిల్‌ తదితరులున్నారు.