జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభకు ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఆహ్వానం – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ నవంబర్ 11 (జనం సాక్షి): టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా మహాసభలకు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి కోలా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డిని జిల్లా మహాసభలకు హాజరుకావాలని హుజూర్ నగర్ జర్నలిస్టులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని గతంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా నాగేశ్వరరావు, నూకల నరేందర్ రెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాసు, టివిఎల్, కీతారామనాదం, దేనము కొండ శేషంరాజు, సోమగాని రాంప్రసాద్, కోమరాజు అంజయ్య, పెందుర్తి భాస్కర్, ఎస్కే జానీ పాషా, దేవరం రామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఇట్టిమల్ల రామకృష్ణ పాల్గొన్నారు.