జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం

హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఏపీ ఈఎన్సీ, ఇరిగేషన్‌ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ ఈఎన్సీ, ఇరిగేషన్‌ అధికారులు గైర్హాజయ్యారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల విచారణ దృష్ట్యా రాలేమని తెలంగాణ అధికారులు వెల్లడిరచారు. సమావేశానికి మరో తేదీ సూచించాలని తెలంగాణ అధికారులు కోరారు. ఇప్పటికే దీనిపై లేఖ రాసారు. ఈ క్రమంలో సమావేశంలో పెద్దగా నిర్ణయాలు ఉండకపోవచ్చని అనుకుంటున్నారు.
ఈ భేటీకి హాజరుకావాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు బోర్డులు లేఖలు రాశాయి. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ తెలిపింది. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల విచారణ ఉన్న నేపథ్యంలో హాజరు కాలేమని, మరో తేదీని ఖరారు చేయాలని తెలంగాణ కోరింది. కాగా ఈ సమావేశాన్ని యాధావిధిగా కొనసాగించే ఆలోచనలో కృష్ణా, గోదావరి బోర్డులు ఉన్నాయి. సమావేశానికి ఏపీ అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది.