జాతిపితకు రాజ్‌ఘాట్‌లో ఘన నివాళి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌,
జనవరి 30,జనంసాక్షి :
మహాత్మా గాంధీ 65వ వర్థంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. గాంధీ మహాత్ముని సమాధిపై పుష్పగు చ్చాలు ఉంచారు. మతసామ రస్య ప్రార్ధనల్లో పాలుపం చుకున్నారు. అలాగే ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ,కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, తదిత రులు రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
హైదరాబాద్‌ …..
లంగర్‌హౌస్‌లో గల బాపూఘాట్‌ వద్ద గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి నివాళులర్పించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు గీతారెడ్డి, దానం నాగేందర్‌ తదితరులు కూడా నివాళులర్పించి సర్వమత ప్రార్ధనల్లో పాలుపంచుకున్నారు.