జాతిపిత మహాత్మాగాంధీ చూపిన బాట అందరికీ మార్గదర్శకం…..

 రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్
జనం సాక్షి సంగారెడ్డి రూరల్
సత్యం, శాంతి, అహింసలే ఆయుధాలుగా  జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని  రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
గాంధీ జయంతి పురస్కరించుకొని ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్ లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, గాంధీ చూపిన బాటలో నడవాలని, అహింస తిరుగులేని గొప్ప ఆయుధమని నిరూపించిన  మహాత్ముడు అని అన్నారు.  భవిష్యత్ తరాలు వారి అడుగుజాడల్లో  నడవాలన్నారు.
జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం అహింస మార్గంలో పోరాడిన గొప్ప మహనీయుడిని, అహింస మార్గంలో దేనినైనా సాధించవచ్చని గాంధీజీ రుజువు చేశారన్నారు. పల్లె లు దేశానికి పట్టుబొమ్మలని నినదించి పల్లె సీమల అభివృద్ధికి పాటుపడ్డారని, అందరికీ మేలు జరిగేలా దేశాభివృద్ధి ఉండాలని తపించిన గొప్ప మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ అందరికీ ఆదర్శనీయుడని, యువత వారు చూపిన బాటలో నడవాలన్నారు.
ఈ కార్యక్రమంలో  జెడ్పి సీఈవో ఎల్లయ్య , ప్రజా ప్రతినిధులు ,అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.