జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలలో మూడో బహుమతి పొందిన సరస్వతిని ఘనంగా సన్మానం

మల్దకల్ నవంబర్18(జనం సాక్షి)మండల పరిధిలోని తాటికుంటఎం పి హెచ్ ఎస్ పాఠశాలలో శుక్రవారంనడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఉపన్యాస పోటీలలో జిల్లాస్థాయి మూడవ బహుమతి పొందిన సరస్వతిని గ్రామ సర్పంచ్ ఆంజనేయులు విద్య కమిటీ చైర్మన్ సోమన్న ఘనంగా సన్మానించారు. తరగతి నాలుగు గోడల మధ్యలో నేర్చుకున్న జ్ఞానాన్ని బహిరంగ పర్చినప్పుడే చదువుకు సార్థకత అని గ్రామ సర్పంచ్ ఆంజనేయులు తెలిపారు.తాటికుంట పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతున్నందుకు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసచారి,నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం వ్యవస్థాప అధ్యక్షులు పాల్వాయి లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు గీత,గోవర్ధన్ గౌడ్,రాంగోపాల్ ,మధుసూదన్ శెట్టి, లక్ష్మయ్య,శ్రీలత,రవి గ్రామస్తులు నరసింహులు రాముడు తదితరులు పాల్గొన్నారు.