జీవన నైపుణ్యాల తరగతుల సందర్శన.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్24(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల పరిధిలోని రాకొండలో కేజీబీవీ లో జరుగుతున్న జీవన నైపుణ్యాల తరగతులను రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సరితా, సుధా మరియు ప్రభుత్వం తరుపున స్టేట్ కేజీబీవీ కో ఆర్డినేటర్ శిరీష ,మరియు జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిత్యజీవితంలో సమాజంలోని వివిధ పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి జీవన నైపుణ్యాలను చర్చించడం జరిగింది. నేటి బాలబాలికల్లో చాలామందికి భావవ్యక్తీకరణ సామర్థ్యం పెంచాలని, సమాజంలో జరుగుతున్న అంశాలపై అవగాహన కల్పించాలని, దీనికి తోడు సురక్షితం కాని అంతర్జాల వినియోగం తో బాల బాలికల పై అఘాయిత్యాలు పెరుగు తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో విద్యార్థు ల్లో జీవన నైపుణ్యాలు పెంపొందిం చేందుకు రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల తో శిరీష మాట్లాడుతూ చదువుతో పాటు బాలబాలిక ల్లో జీవన నైపుణ్యాల పెంపునకు కృషి చేయాలని,ముఖ్యంగా వారిలో ఆత్మవిశ్వా సం పెంపొందించడం భావవ్యక్తీకరణ, ఋతుస్రావం పై అవగాహన,ఆరోగ్యకరమైన సంబంధాలు, సురక్షిత ప్రదేశాలను గుర్తించడం, సమయపాలన పాటించడం, నాయకత్వ లక్షణాలు, పొదుపు చేయడం, ఇంటర్నెట్ వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, ఆడ మగ తేడా లేకుండా లింగ సమానత్వం తో ఉండడం, స్వీయ గుర్తింపు, సామాజిక అవగాహన మరియు తదితర అంశాలను విద్యార్థులకు తెలియాలని అన్నారు.ప్రతి విద్యార్థి జీవితం లో జీవన నైపుణ్యాలు ఏంతో అవసరమని జిసిడిఓ చైతన్య అన్నారు.రూంటూరీడ్ ప్రతినిధుల కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ కేజీబీవీ విద్యార్థుల కు జీవన నైపుణ్యాలను ఇవ్వడం గురుంచి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్టేట్ కో ఆర్డినేటర్ శిరీష, జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య, రూమ్ టు రీడ్ ప్రతినిధులు సరిత, సుధ, శ్రీలత, వాని కేజీబీవీ ఎస్ఓ హసీన మరియు ‌‌సి ఆర్ టి లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గున్నారు.