జై తుల్జా భవాని మాతను దర్శించుకున్న జెడ్పి చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి.

బషీరాబాద్ మండల పరిధిలో శుక్రవారం రోజున దామర్ చెడ్ గ్రామ లో వెలసిన తుల్జా భవాని మాత జాతరకు ముఖ్య అతిథిగా  జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమములో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,గ్రామ సర్పంచ్ నర్సిరెడ్డి,దేవాలయ కమిటీ సభ్యులు,వివిధ గ్రామాల సర్పంచులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.