జొన్నాడ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
హైదారాబాద్: తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ను కోరారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. జిల్లాలోని ఆలమూరు మండలం జొన్నాడ వద్ద రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.