టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

జూలూరుపాడు, ఆగష్టు 6, జనంసాక్షి: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి వేడుకలను టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ ఆదేశాల మేరకు పార్టీ మండల అధ్యక్షుడు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో జూలూరుపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. సిఎం కెసిఆర్ అడుగుజాడలో నడిచి బంగారు తెలంగాణా లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లావుడియా సోని, సోసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, రైతుబంధు మండల కోఆర్డినేటర్ యదళ్లపల్లి వీరభద్రం, మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, ఎంపీటీసీలు దుద్దుకూరి మధుసూదనరావు, పొన్నెకంటి సతీష్, నాయకులు రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, దుద్దుకూరు కృష్ణప్రసాద్, చాపలమడుగు రామ్మూర్తి, యల్లంకి పుల్లయ్య, మాచినేని సత్యం, గుగులోతు చంటి, మోదుగు రామకృష్ణ, మిర్యాల కిరణ్, పణితి వెంకటేశ్వర్లు, మైబు, మాడుగుల నాగరాజు, దేవరకొండ కిరణ్, మహేష్, వెంకన్న, గోపయ్య, నరసింహారావు, మంద రమేష్, నాగయ్య, మంద సురేష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.