టిటిడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
మాజీ ఎంపి చింతా మోహన్ ఆందోళన
తిరుపతి,నవంబర్27(జనంసాక్షి): కాలయాపన లేకుండా వెంటనే టిటిడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలివ్వాలని.. మాజీ ఎంపి చింతా మోహన్ మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనం ముందు నిరసన నిర్వహించారు. ప్లకార్డులు చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి, జనవరి మొదటి తేదీలలో స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలని, స్థానికులకు ఎల్ వన్ దర్శనం ప్రతీ నెల మొదటి మంగళవారం ఉచితంగా ఇవ్వాలని, టిటిడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. మరోవైపు.. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద మరో సారి
నిఘా వైఫల్యం చోటు చేసుకుంది. టిటిడి చట్టం ప్రకారం అలిపిరి తనిఖీ కేంద్రం నుండి పైకి వాహనాలను పంపకూడదు. కాని మాజీ ఎంపి చింతా మోహన్ వాహనాలను అనుమతించారు.